రోశయ్య రిటైర్డ్మెంట్ ప్రకటన

తమిళనాడు మాజీ గవర్నర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య రాజకీయలకు రిటైర్డ్మెంట్ ప్రకటన చేశారు. ఆయన మంగళవారం గుంటూరులో మాజీ ఎమ్మెల్యే జయరామ్ బాబు ఇంటికి రోశయ్య వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన్ని కలిసేందుకు పార్టీలకు అతీతంగా నేతలు తరలివచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రోశయ్య.. ఇకపై రాజకీయాలకు రిటైర్డ్మెంట్ ప్రకటించినట్టేనన్నారు. నా వయసు పెరగడంతో రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించట్లేదు. ఎక్కడికైనా వెళితే అక్కడి స్నేహితులను కలుసుకోవడమే తప్ప..రాజకీయాల గురించిన ఆలోచన లేదని తెలిపారు. గుంటూరులో రోశయ్యని కలిసిన వారిలో తలు రాయపాటి శ్రీనివాస్, జేడీ శీలం, మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.