Telangana Elections 2023 : పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన సినీ తారలు..


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతుంది. ఓటు హక్కును వినియోగించేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం క్యూ లైన్‌లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కీరవాణి, వెంకటేష్, శ్రీకాంత్, నితిన్, సుమంత్.. ఇలా ప్రతి ఒక్కరు పోలింగ్ బూత్ కి చేరుకొని తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటున్నారు.

జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ బూత్ లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో వచ్చి ఓటు వేసారు.. జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ పోలింగ్‌ బూత్‌లో అల్లు అర్జున్.. జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూలులో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఎస్‍ఆర్ నగర్‍లో నటుడు ప్రకాష్ రాజ్, మణికొండలో దగ్గుబాటి వెంకటేష్ తమ ఓటు హక్కును వినియోగించుకోగా, జూబ్లీహిల్స్‌ పబ్లిక్ స్కూల్ లో శ్రీకాంత్ ఫ్యామిలీతో కలిసి ఓటు వేసేందుకు వచ్చారు. ఇక హీరో నితిన్ కూడా జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.