Telangana Elections 2023 : తెలంగాణాలో ప్రశాంతంగా పోలింగ్..


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం 4 గంటలకే ముగియనుంది. ఇక ఓటు హక్కును వినియోగించేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు భద్రత కట్టుదిట్టం చేశామని, ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుందని తెలిపారు. అంతేకాదు ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 70 వేల మంది పోలీస్ సిబ్బంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి హోంగార్డ్ సిబ్బంది, కేంద్ర బలగాలతో బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. నేను నా భార్య ఇద్దరం మా ఓటు హక్కును వినియోగించుకున్నాం. మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ కోరారు.