ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు అధికార..ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు తూటాలు పేలాయి. ముఖ్యమంత్రి జగన్ తన ఆగ్రహాన్ని చాల పద్దతిగా తూటాలనే పేల్చారు. గత శాసనసభలో 23మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంతలో పశువులను కొన్నట్టు కొన్నారని, ముగ్గురు ఎంపీలను కూడా కొనుగోలు చేశారని, చివరకు ఏం జరిగిందని ఆయన టీడీపీ సభ్యులను ఉద్దేశించి ప్రశ్నించారు.
పైన దేవుడు, ప్రజలు కలిసి గూబ గూయ్మనే రీతిలో ఈ అన్యాయాలను తిప్పికొట్టారని, అన్యాయం చేసిన మాదిరిగానే టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఇచ్చారని, అదీ కూడా సరిగ్గా 23వ తారీఖు నాడే ఇచ్చారని, దేవుడు, ప్రజలు కలిసి ఇచ్చిన జడ్జిమెంట్ ఇదని, ఇంతకన్నా కరెక్ట్ జడ్జిమెంట్ ఉండదని పేర్కొన్నారు.
ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.