హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ ప్రస్తుతం ప్రస్తుతం ‘అర్జున్రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’లో నటిస్తున్నారు. బాల దర్శకుడు. మేఘ కథానాయిక.
దీని తర్వాత ధృవ్ సినిమా ఖరారైనట్లు సోషల్మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నట్లు సమాచారం. విక్రమ్ కూడా పెద్ద దర్శకుడితో తన కుమారుడ్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని చూస్తున్నారట. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
శేఖర్ కమ్ముల గత ఏడాది ‘ఫిదా’తో హిట్ అందుకున్నారు. వరుణ్తేజ్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఆదరగొట్టింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ కొత్త సినిమా ప్రకటన రాలేదు శేఖర్ కమ్ముల నుండి. ఇప్పుడు ఆయన విక్రమ్ కుమారుడి పై ద్రుష్టిపెట్టడం విశేషం.