ప్రస్తుతం హీరోయిన్లు పారితోషికాలు భగ్గుమంటున్నాయి. ఈ జాబితాలో రష్మిక కూడా చేరిపోయింది. శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న `ఆడాళ్లూ మీకు జోహార్లూ` సినిమా కోసం రష్మికని కథానాయికగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రష్మిక.. తన సినీ జీవితంలోనే అత్యధిక పారితోషికం అందుకోబోతోందట. తన పారితోషికం ఇంచుమించుగా.. 1.75 కోట్ల వరకూ ఉంటుందని టాక్.
నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోలూ, హీరోయిన్లూ 20 నుంచి 30 శాతం వరకూ పారితోషికాల్ని తగ్గించుకోవాలని చెబుతున్నారు. లాక్ డౌన్కి ముందున్న పారితోషికాలలో 30 శాతం కోత విధించాలి. ఆ లెక్కన రష్మికకు కోటి కూడా ఇవ్వకూడదు. కానీ.. ఏకంగా 1.75 కోట్లు ముట్టజెప్పాల్సివస్తోంది. తన పారితోషికం 2 కోట్లు డిమాండ్ చేసి, అందులో.. 25 తగ్గింపు ఆఫర్ ఇచ్చిందని టాక్.