సామ్ అడుగుతో చేతులు మారిన అన్నపూర్ణ స్టూడియోస్..

అన్నపూర్ణ స్టూడియోస్..ఈ బ్యానర్ నుండి ఎన్నో హిట్ చిత్రాలే కాదు ఎన్నో మరపురాని సీరియల్స్ వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. గత కొంత కాలంగా ఈ బ్యానర్ బాధ్యతలను అక్కినేని నాగార్జున చూసుకుంటున్నాడు. కానీ ఇటీవలే బిజినెస్ పనులు ఎక్కువ అవ్వడం వల్ల నాగ్ తీవ్ర ఇబ్బంది పడుతున్నాడట. ఓ పక్క బ్యానర్ బాధ్యతలు , మరోవైపు బిజినెస్ పనులు ఇలా రెండు చూసుకోలేకపోతున్నాడట.. ఈ నేపథ్యం లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ బాధ్యతలను నాగ చైతన్య – సమంతలకు అప్పజెప్పినట్లు తెలుస్తుంది.

అక్కినేని నాగేశ్వరరావు అనంతరం నాగార్జున ఎంతో సమర్థంగా ఈ బ్యానర్ ఫై ఎన్నో సినిమాలను, సీరియళ్లను నిర్మించి సక్సెస్ అయ్యాడు. ఇపుడు మూడో తరం నాగచైతన్య-సమంత జంటకు దక్కింది. నాగచైతన్య-సమంత కలిసి బ్యానర్ బాధ్యత – ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటున్నారట. ఇటీవల ఇతర ఔత్సాహికులు నిర్మించిన “చి ల సౌ” సినిమాను చూసి ఆకర్షితులైన చైతూ , సామ్ జంట తమ బేనర్ కిందకు తెచ్చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఈ విషయం అధికారికంగా ప్రకటించారు.

సమంత పేరు బ్యానర్ లో కనిపించకపోయినా వెనుకాల బాధ్యతలు మాత్రం పూర్తిగా చూసుకుంటుంది. అందుకే ఇద్దరూ కలిసి ఈ సినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో..వారి నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.