బాక్సాఫీస్ కు ఏప్రిల్ కలిసొస్తుందా..?

గత రెండు నెలలుగా బాక్సాఫీస్ దగ్గర సరైన సినిమాలు లేకపోయేసరికి అభిమానులు బాగా డిస్టాప్ అయ్యారు. ఇండస్ట్రీ లో చాలామంది స్టార్ హీరోలు , డైరెక్టర్స్ ఉన్నప్పటికీ సరైన సినిమా ఒక్కటి కూడా రాలేదని ఫీల్ అయ్యారు. కానీ ఏప్రిల్ నెల మాత్రం వారిలో సంతోషం నింపింది. ముఖ్యం గా ఎమోషనల్ సినిమాలకు ఏప్రిల్ బాగా కలిసొచ్చేలా కనిపిస్తుంది.

ఎందుకంటే ఏప్రిల్ 05 న మజిలీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. చైతు , సామ్ జంటగా నటించిన ఈ మూవీ ఎమోషనల్ డ్రామాగా వచ్చి మంచి సక్సెస్ సాధించింది. గత కొంతకాలంగా హిట్ లేని చైతు కు ఈ సినిమా బూస్ట్ ఇచ్చింది. టాక్ పరంగానే కాదు కలెక్షన్ల పరంగా కూడా చైతు కు బెస్ట్ ఇచ్చింది.

ఇక ఏప్రిల్ 12 న విడుదలైన మరో ఎమోషనల్ మూవీ చిత్రలహరి..సాయి తేజ్ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఆరు ప్లాప్ సినిమాలతో ఉన్న తేజ్ కు ఈ మూవీ ఊపిరి పోసినట్లు అయ్యింది.

ఇక ఇదే నెల చివరిలో మరో ఎమోషనల్ సినిమా రాబోతుంది..అదే తేజ డైరెక్ట్ చేసిన సీత. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన తేజ..బెల్లం కొండ శ్రీనివాస్ తో సీత అనే సినిమా చేసారు. ఏప్రిల్ 29 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తేజ సినిమాలన్నీ ఎమోషనల్ గా ఉంటాయి. సీత మాత్రం ఈ విషయంలో ఇంకాస్త ఎక్కువే అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరీ ఈ నెలలో ఎమోషనల్ చిత్రాలుగా వచ్చిన రెండు హిట్స్ అయ్యాయి..మరి సీత ఎలా ఉండబోతుందో చూడాలి.