భారత్ ట్రైలర్ చూసారా..?

కండల వీరుడు సల్మాన్ ఖాన్ , హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ జంటగా అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భారత్’. ఈ మూవీలో సల్మాన్ ఖాన్..ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం.

అందులో ఒకటి సామాన్యుడి పాత్ర.. మరోకటి ఇరవైయేళ్ల యువకుడి క్యారెక్టర్…. ఇంకోకటి సైనికుడి రోల్. మిగతా రెండు పాత్రలు సస్పెన్స్ లో ఉంచారు. దేశభక్తితో పాటు ఫ్యామిలీ సెటిమెంట్, లవ్ అన్నీ కలగలిపి ఈ చిత్రాన్ని టి సిరీస్, సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ఇక ఆ ట్రైలర్ ఎలా ఉందో మీరే లుక్ వెయ్యండి.