విజయ్ దేవరకొండ-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘అర్జున్రెడ్డి’. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇపుడు ఈ సినిమా ‘కబీర్ సింగ్’ గా బాలీవుడ్ లో రీమేక్ అయ్యింది. ఈ సినిమాకు కూడా సందీప్ రెడ్డినే దర్శకత్వం వహించాడు. షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ జంటగా నటించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ రీమేక్ చూసిన జనాలు షాక్ అవ్వలేదు కానీ బావుందనే కామెంట్లు చేస్తున్నారు. రివ్యూలు కూడా ఓకే అనిపించాయి. తెలుగు కధనే హిందీలు కూడా చూపించారు. పెద్ద మార్పులు లేవు. ‘అర్జున్రెడ్డి’ సినిమా చూసినవారికి సీన్లు అన్నీ మళ్ళీ కొత్త నటీనటులతో రిపీట్లుగా అనిపిస్తాయి. అయితే హిందీ ప్రేక్షకుల్లో దాదాపు చాలా మంది ‘అర్జున్రెడ్డి’ సినిమాను చూసి ఉండరు కాబట్టి.. ‘కబీర్ సింగ్’ పాత్రకు ఫిదా అవుతున్నారు. షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ కెమిస్ట్రీ బావుంది. సినిమాని చాలా రిచ్ గా తీశారు. ఎక్కడా రాజీపడలేదు.