కొరటాల ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా..?

మిర్చి చిత్రం తో డైరెక్టర్ గా మారిన రైటర్ కొరటాల శివ..మొదటి చిత్రం తోనే సూపర్ హిట్ అందుకొని ,అందరి చూపుల్లో పడ్డాడు. ఈ సినిమా తర్వాత శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను ఇలా వరుస హిట్స్ అందుకొని అతి తక్కువ టైం లోనే అగ్ర దర్శకుడి జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం మెగా స్టార్ తో ఓ సినిమా చేసేందుకు సిద్ధం గా ఉన్నాడు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తియిన తర్వాత కొరటాల దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ముందుగా జనవరి లో కొరటాల మూవీ సెట్స్ పైకి తీసుకుకెళ్లాలని ప్లాన్ చేసినప్పటికీ సైరా ఆలస్యం కావడం తో కొరటాల మరి కొద్ది నెలలు వేచి చూడక తప్పేలా లేదు. ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకని తన క్లోజ్ ఫ్రెండ్ లీడింగ్ డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని సుధాకర్ తో కలిసి లో బడ్జెట్ తో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను నిర్మించాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాల కు కొరటాల సమర్పకుడి గా కూడా వ్యవహరిస్తాడట. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు మొదలు అయ్యాయని సమాచారం.

ఇప్పటికే స్టార్ డైరెక్టర్ సుకుమార్ చిన్న చిత్రాల నిర్మాణంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సుక్కు ఈ మధ్య జోరు పెంచి పలు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను ఒకే సారి నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఇదే బాటలో కొరటాల శివ కూడా పయనిస్తున్నట్లు అర్ధం అవుతుంది. మరి కొరటాల ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.