శ్రీ రెడ్డి ని కుక్కతో పోల్చింది..

శ్రీ రెడ్డి..ఈ పేరు గురించి కొత్తగా , ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత నాల్గు నెలల నుండి మీడియా లో తెగ ప్రచారం అవుతూనే ఉంది. కాస్టింగ్ కౌచ్ తో మొదలు పెట్టిన ఈమె, ఇప్పుడు తమిళ లీక్స్ వరకు వెళ్ళింది. ఇటీవల టాలీవుడ్ పరిశ్రమ వ్యక్తుల గురించి ఏం చెప్పిన పెద్దగా పట్టించుకోకపోవడం తో తమిళబాట పట్టింది. ఇప్పటికే పలువురు తమిళ నటులు నన్ను మోసం చేసారని , సినిమా అవకాశాల పేరుతో వాడుకున్నారని కొంతమంది పేర్లు బయట పెట్టి హల్చల్ చేయడం మొదలు పెట్టింది.

దర్శకుడు సుందర్ సి తనకు ఆఫర్ ఇస్తానని చెప్పి శారీరకంగా వాడుకున్నాడని వ్యాఖ్యలు చేయడంతో, ఈ వ్యాఖ్యలపై సుందర్ వెంటనే స్పందించాడు. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని.. ఈ విషయంపై తాను లీగల్ యాక్షన్ తీసుకుంటానని చెప్పడంతో.. శ్రీరెడ్డి షాక్ తిన్నది. తాజాగా శ్రీరెడ్డిపై సుందర్ సి భార్య ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీ రెడ్డి ని కుక్కతో పోల్చి ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. కుక్కలు మొరుగుతుంటాయని.. అది ఆ జాతికి పుట్టుకతో వచ్చిన లక్షణమని.. వాటి గురించి పట్టించుకోవడం అనవసరం అని.. వాటికి స్పందించడం తెలివితక్కువతనం అవుతుందని కామెంట్ చేసింది.