సూపర్ స్టార్ చేతుల మీదుగా రంగ్ దే సాంగ్ రిలీజ్

భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్..ప్రస్తుతం సెట్స్ ఫై ఉన్న సినిమాల ఫై ఫుల్ ఫోకస్ పెట్టాడు. వాటిల్లో రంగ్ దే చిత్రం ఒకటి. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.  ‘గిమ్మీ సమ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్.

నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామన్‌గా పనిచేస్తున్నారు. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ అన్నీ కూడా సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచాయి. అయితే తాజాగా ‘రంగ్ దే’ మూడో పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ నెల 4వ తేదీన సాయంత్రం 4:05 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించనున్నాడు. దేవీ సంగీత సారథ్యంలో సిధ్ శ్రీరామ్ మొదటిసారిగా పాట పాడుతున్నాడు.