సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం సింగపూర్లోని మేడమ్ టుస్సాడ్లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ద
అయితే ఈ మైనపు బొమ్మను చూసేందుకు ప్రతి ఒక్కరూ అక్కడకు వెళ్లడం సాధ్యపడదు. అందుకే ఆ తరహా విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. మహేశ్బాబు మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ తరలిస్తున్నారు. అభిమానుల కోసం మార్చి 25న గచ్చిబౌలిలోని ఏఎమ్బీ మల్టీప్లెక్సులో దీన్ని ప్రదర్శనకు ఉంచబోతున్నారు. మహేశ్ విగ్రహాన్ని లాంచ్ చేయబోతున్నారు. ఒక్క రోజుపాటు విగ్రహం ఇక్కడే ప్రదర్శన నిమిత్తం ఉంటుంది. తిరిగి మ్యూజియం సిబ్బంది విగ్రహాన్ని సింగపూర్కు తీసుకెళ్తారు.
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. పైడిపల్లి వంశి దర్శకత్వంలో మహర్షి సినిమా చేశారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను మే మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. యంగ్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రను పోషిస్తున్నాడు.ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.