తన గురువు మణిరత్నంతో కలిసి పనిచేయడం ఆసక్తిగా ఉంటుందని ఐశ్వర్య రాయ్ బచ్చన్ చెప్పింది. కల్కి రచించిన ‘పొన్నియిన్ సెల్వన్’ పుస్తకం ఆధారంగా మణిరత్నం సినిమా తీయబోతున్నారు. ఇందులో ఐశ్వర్య నటించనున్నారు. ” మణి సర్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నేను ఆయనతో కలిసి పనిచేస్తున్నా. నా గురువు గారితో పనిచేయడం ఎప్పుడూ థ్రిల్గానే ఉంటుంది. బ్యాక్ టు స్కూల్’ అని ఐశ్వర్య చెప్పారు.
‘పొన్నియిన్ సెల్వన్’లోని రాణి నందిని అనే పాత్రను ఐష్ పోషించబోతున్నారట. ఆమె రాజు పెరియా పజువెట్టరైయర్ భార్య. ఇదే సినిమాలో కార్తీ, జయంరవి, విక్రమ్, కీర్తి సురేశ్, అమితాబ్ బచ్చన్, అనుష్క నటించబోతున్నట్లు సమాచారం.