నితిన్ మూవీ లో నయనతార..

‘భీష్మ’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నితిన్ ప్రస్తుతం ‘రంగ్ దే’ సినిమా చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధాదున్’ తెలుగు రీమేక్‌లో నితిన్ నటించనున్నారు. ఈ సినిమాను మేర్లపాక గాంధీ దర్శకత్వం చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్ ని ఎంపిక చేశారట. అంధాధున్‌ సినిమాలో హీరోయిన్ టబు కీలక పాత్రలో నటించింది. ఈ పాత్ర కొంచెం బోల్డ్ గా ఉంటుంది. తెలుగులో ఈ కీ రోల్ లో ఎవరు నటిస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా టబు నే తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించారట. కానీ కుదరలేదు. ప్రస్తుతం ఈ పాత్ర కోసం మరో స్టార్ హీరోయిన్ నయనతార ను సంప్రదిస్తున్నారట నిర్మాతలు. నయన్ ఒప్పుకుంటే ఈ సినిమా పై ఉన్న అంచనాలు మరింత పెరగడం ఖాయం.