ఎన్టీఆర్ అరుదైన ఘనత సాధించారు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ గా కూడా ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. కేవలం సినిమాల పరంగానే కాదు..పర్సనల్ గా కూడా ఎన్టీఆర్ ను అభిమానిస్తారు. ఎప్పుడూ అభిమానులకు మొదటి ప్రాధాన్యమిచ్చే ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో కూడా వారికి అందుబాటులో ఉంటారు.

అందుకే ట్విట్టర్లో ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఆ సంఖ్య మూడు మిలియన్ల మార్కును చేరుకుంది. ఈ నేపథ్యంలో అభిమానులు పండగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.