పవన్ యూరప్ టూర్..ఎవరితోనో తెలుసా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సడెన్ గా యూరప్ కు వెళ్లడం అంతటా చర్చ గా మారింది. ఉన్నట్టుండి పవన్ యూరప్ ఎందుకు వెళ్ళారా..అని అంత మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అయితే పవన్ ఒక్కడే కాదు తన ఫ్యామిలీతో కలిసి యూరప్ వెళ్లారు. కొడుకు శంకర పవనోవిచ్ కు క్రిస్టియన్ మతాచారాల ప్రకారం చేయవలసిన కొన్ని లాంఛనాలను ఈ క్రిస్టమస్ రోజున పూర్తి చేయాల్సి ఉంది. అందుకే ఆయన భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్లినట్లు తెలుస్తుంది.

క్రిస్మాస్ తర్వాత మళ్లీ పవన్ హైదరాబాద్ కు రానున్నారు. యూరప్ పర్యటన అనంతరం ఫుల్ టైం అమరావతిలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానని పవన్ కళ్యాణ్ తెలిపాడు. ఇటీవలే పవన్ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.