ప్రియమణి మళ్లీ బిజీ అవుతుందా..?

సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్లు గా చలామణి అవుతున్న సమయంలో పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు అవుతారు..మరికొంతమంది అవకాశాలు తగ్గడం తో పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెపుతుంటారు. ఆలా పెళ్లి చేసుకొని కొంతకాలం తర్వాత మళ్లీ ఇండస్ట్రీ లో రి ఎంట్రీ ఇస్తుంటారు. ఇప్పటికే ఆలా చాలామంది రి ఎంట్రీ ఇచ్చి మళ్లీ బిజీ అవుతున్నారు. తాజాగా వీరి లిస్ట్ ప్రియమణి కూడా చేరబోతోంది.

2003 లో ఎవరే అతగాడు చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రియమణి..ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యింది. తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళం ఇలా నాల్గు భాషల్లో నటించి ప్రేక్షక అభిమానం చొరగొన్నది.

కెరియర్ మంచి స్పీడ్ లో ఉన్న సమయంలో 2017 లో పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది. మళ్లీ కాస్త గ్యాప్ తరవాత రి ఎంట్రీ ఇచ్చేందుకు డిసైడ్ అయ్యింది. ప్రస్తుతం డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం సిరివెన్నెల అనే సినిమాలో ప్రియమణి నటిస్తోంది. టాకీపార్ట్ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్నది. అలాగే రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ లో ఓ కీలక రోల్ ఈమెకు దక్కిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ రోల్ అమ్మడికి దక్కితే మళ్లీ బిజీ కావడం ఖాయం.