వెంకీమామ నుండి రకుల్ అవుట్..

వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో వెంకీమామ అనే మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర మొదటి షెడ్యూల్ రాజమండ్రి లో ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రకటన వచ్చిన దగ్గరు నుండే ఈ మూవీ లో చైతు కు జోడిగా రకుల్ ప్రీతీ సింగ్ నటిస్తుందనే ప్రచారం జరుగుతూ వస్తుంది. తాజాగా ఆమెకు చిత్ర యూనిట్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఆమెకు బదులు ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నాబా నటేష్ ను తీసుకున్నారని సమాచారం. నిన్నటి వరకు రాకులే అంటూ ప్రచారం చేసి సడెన్ గా ఆమెను తప్పించడం వెనుక కారణాలు ఏంటి అనేది అధికారికంగా బయటకు రాలేదు. ఇప్పటికే తెలుగులో అవకాశాలు రావడం తగ్గడం తో వెంకీమామ పైనే భారీ ఆశలు పెట్టుకుంది రకుల్. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా మిస్ అవ్వడం అభిమానులకు నిరాశ మిగిలిస్తుంది.

వెంకటేష్ కు జోడిగా మాత్రం ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.