ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం తో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఒకటి , క్రిష్ డైరెక్షన్లో , సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మరో చిత్రాన్ని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూడే కాక మరో చిత్రానికి ఓకే చెప్పాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పవన్కల్యాణ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ‘కింగ్ ఆఫ్ యాటిట్యూడ్. .. తెలుగు సినిమా ఫేవరేట్ పోలీస్ ఆఫీసర్ మరోసారి హై ఓల్టేజ్ రోల్తో మరోసారి రాబోతున్నారు’ అంటూ సినిమాను అనౌన్స్ చేశారు.
ఇది మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్కు రీమేక్ అని, వకీల్ సాబ్ తర్వాత పవన్ ఈ చిత్రంలోనే నటించనున్నాడని అంటున్నారు. అలాగే పవన్తో పాటు రానా కూడా ఈ చిత్రంలో నటించబోతున్నాడు. కాగా ఈ మూవీ లో పవన్కు జోడిగా సాయి పల్లవి ఫిక్స్ అన్నది ఇండస్ట్రీ టాక్. అలాగే రానాతో జోడి కడుతున్న బ్యూటీ రెజీనానే అంటూ వార్తలొస్తున్నాయి. కొద్ది రోజులుగా తెలుగు స్క్రీన్కు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బిగ్ బ్యాంగ్తో బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. మరి ఈ వార్త నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది.