శాటిలైట్ రైట్స్ తో సంబరపడుతున్న సాక్ష్యం నిర్మాత…

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం ‘సాక్ష్యం’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ ఫై అభిషేక్ నామా దాదాపు రూ. 40 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. జులై 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా బి. సి సెంటర్లలో రన్ అవుతుంది.

టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ కు మంచి ధర పలకడం తో చిత్ర నిర్మాత సంతోష పడుతున్నారు. తెలుగు శాటిలైట్ హక్కులు రూ.8 కోట్ల వరకు అమ్ముడుపోగా, హిందీ రైట్స్ ద్వారా మరో రూ.5 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినట్లు సమాచారం. మొత్తం కలుపుకుంటే రూ.13 కోట్లు శాటిలైట్ రూపంలో వచ్చినట్లు తెలుస్తుంది. బెల్లం కొండ శ్రీనివాస్ గత చిత్రాల శాటిలైట్ రైట్స్ తో పోలిస్తే ఈ సినిమాకు పెద్ద మొత్తంలో పలుకడం విశేషం.