మొక్కలు నాటిన డైరెక్టర్

రాజ్య‌స‌భ సభ్యులు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ప్రముఖ రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, క్రీడా ప్ర‌ముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరికొంతమందికి విసురుతున్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో అడవి శేషు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి దర్శకుడు శశీ (మేజర్ సినిమా) నేడు ఖాజాగూడ లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చాలా మంచి ఛాలెంజ్ ను చేపట్టారని అన్నారు. ప్రతి ఒక్కరం మొక్కలను పెంచి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అప్పుడే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన మిత్రులు శరత్ చంద్ర; అనురాగ్ మారెడ్డి లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేసారు.