నంది అవార్డులపై శివాజీ కామెంట్స్

ప్రస్తుతం టాలీవుడ్ లో నంది అవార్డుల రభస కొనసాగుతుంది. ఏపీ సర్కార్ ప్రకటించిన అవార్డ్స్ లో అర్హత వున్న చిత్రాలకు అవార్డులు ఇవ్వలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో సినీ హీరో శివాజీ స్పందిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

త‌న‌కు కూడా గ‌తంలో ఇలాగే తీవ్రంగా అన్యాయం జ‌రిగింద‌ని సినీ ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర భ‌జ‌న చేసి అవార్డులు తీసుకుంటున్నార‌ని చెప్పారు. తాజాగా ప్ర‌క‌టించిన‌ నంది పుర‌స్కారాల్లో మెగా ఫ్యామిలీకి అన్యాయం జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని, టీడీపీకి చెందిన వారికే అవార్డులు ఇవ్వ‌డం న్యాయం కాదని మండిప‌డ్డారు. అవార్డులు ఇవ్వాలంటే ఒక కమిటీ వేసి, ప్ర‌జ‌ల అభిప్రాయం సేక‌రించి అప్పుడు అవార్డులు ఇవ్వాలని శివాజీ అభిప్రాయ‌ప‌డ్డారు.