‘ఆర్ఆర్ఆర్’ లో నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ లో సాహో బ్యూటీ శ్రద్ద కపూర్ నటిస్తుందంటూ సోషల్ మీడియా లో వైరల్ అయినా సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో ఎన్టీఆర్ కి జోడిగా బ్రిటన్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ ఎంపిక చేసారు రాజమౌళి. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. అయితే ఎన్టీఆర్ కి జోడి కోసం రాజమౌళి వెతికే పనిలో పడ్డాడు. ఈ నేపథ్యంలో పలువురు పేర్లు ప్రచారం అయ్యాయి. దాంట్లో పరిణీతి చోప్రా, ఆ తరువాత నిత్యా మీనన్ పేర్లు బాగా వినిపించాయి.

కానీ శ్రద్ద కపూర్ ను రాజమౌళి ఫిక్స్ చేసారని బలంగా వార్తలు వినిపించేసరికి అంత నిజమే అని ఫిక్స్ అయ్యారు. ఈ వార్తలు శ్రద్ద వరకు వెళ్లడం తో ఈ వార్తల ఫై ఆమె స్పందించింది. వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన రాజమౌళి సినిమాలో నటించే వీలు కుదరడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రంలో నటిస్తుంది.