సందీప్ కిషన్ బండారం బయటపెట్టిన శ్రీ రెడ్డి..

ప్రతి రోజు ఏదో ఒక బండారం బయటపెడుతూ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న నటి శ్రీ రెడ్డి..తాజాగా మరో యంగ్ హీరో విషయాలు బయటపెట్టి మరోసారి చర్చగా మారింది. కాస్టింగ్ కౌచ్ పై పోరాటం పేరుతో మీడియా కు ఎక్కినా ఈమె , ఆ తర్వాత పోరాటాన్ని పక్కన పెట్టి ఇండస్ట్రీ కి చెందిన హీరోలను , నిర్మాతలను టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. ఆ మధ్య హీరో నాని ఫై కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసి చివరకు నాని నుండి నోటీసు లు అందుకునే వరకు వచ్చింది. ఆ తర్వాత నాని ఫై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్ అయిపొయింది.

ఇటీవల తమిళ్ లీక్స్ అంటూ టాప్ డైరెక్టర్ మురగదాస్ , రాఘవ లారెన్స్, శ్రీకాంత్ ( శ్రీరామ్ ) వంటి తమిళ స్టార్స్ ఫై కామెంట్స్ చేసి దుమారం రేపింది. ప్రస్తుతం ఈ వార్తలు ఇంకా చక్కర్లు కొడుతున్నప్పటికీ , తాజాగా తన ఫేస్బుక్ ద్వారా కొన్ని ఎమోషనల్ పోస్టులు చేసి, హీరో సందీప్ కిషన్ బండారం బయటపెట్టింది.

హీరోల మీద కోపంతో తెలుగు సినిమాలని, మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. ఆడపిల్లల ఉసురు పోసుకున్నవారు చరిత్రలో బాగుపడలేదు అంటూ శ్రీరెడ్డి ఎమోషనల్ గా తన ఫేస్ బుక్ పేజీ లో పోస్ట్ పెట్టింది. నా మీద నమ్మకం లేదా అంటూ మాయమాటలు చెప్పే వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని, మహిళలతో పెట్టుకుని రాజ్యాలే పోగుట్టుకున్న వారు చరిత్రలో ఉన్నారు. ఇక మీ స్టూడియోలు ఎంత.. మీ బతుకులు ఎంత అంటూ శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు శ్రీరెడ్డి పరోక్షంగా ఓ నిర్మాతని ఉద్దేశించి చేసినట్లు క్లియర్ గా అర్ధం అవుతుంది.

మాయ మాటలు చెప్పగానే పిచ్చితనంతో నమ్మేస్తాం. నమ్మడమే నేను చేసిన తప్పు అని శ్రీరెడ్డి పేర్కొంది. ఈ ప్రపంచంలోకెల్లా అతడు మోసకారి అని , ప్రతి మహిళని కోరుకుంటాడు. అతడు మరెవరో కాదు సందీప్ కిషన్ అంటూ శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. తనకు కనీసం బ్రతకాలని కూడా అనిపించడం లేదని ఎమోషనల్ అయింది.