జెన్నిఫర్ లోపెజ్ భవంతిలో శ్రీను వైట్ల..

వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న శ్రీను వైట్ల తాజాగా రవితేజ తో అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా చేసాడు. నవంబర్ 16 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్లతో బిజీ గా ఉన్న శ్రీను వైట్ల ఓ ఆసక్తికర విషయాన్నీ తెలియజేసాడు. పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ పేరు తెలియంది వారు ఉండరు. అలాంటి పాప్ హాట్ బ్యూటీ బెడ్ ఫై శ్రీను వైట్ల పడుకున్నట్లు తెలియజేసాడు.

అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా కొంతభాగం అమెరికా లో షూట్ చేసారు. ఇప్పటివరకు చాల తెలుగు సినిమాలు అమెరికాలో షూటింగ్ జరుపుకోవడం జరిగింది. కానీ ప్రముఖ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ భవంతిలో షూటింగ్ జరుపుకోవడం ఇదే మొదటిసారి. ఈ భవంతి విశేషాలను శ్రీను మీడియా తో పంచుకున్నారు.

“జెన్నిఫర్ లోపేజ్ భవంతి అమ్మేసింది. దాన్ని మల్లారెడ్డి అనే తెలుగు వ్యక్తి తీసుకున్నారు. అదే టైమ్ లో మా సినిమాలో ఛైల్డ్ ఎపిసోడ్ కోసం మేము ఓ పాత భవంతి కోసం వెదుకుతున్నాము. యూరోప్ లో తీద్దాం అనుకున్నాను. సరిగ్గా అదే టైమ్లో అమెరికాలో జెన్నిఫర్ భవనం కనిపించింది. వెంటనే ఓకే చేశాను. అంతే కాదు షూట్ షూటింగ్ సమయంలో జెన్నిఫర్ లోపెజ్ పడుకున్న మంచంపైనే హాయిగా పడుకున్నాడని చెప్పుకొచ్చాడు.

ఈ భవంతి షూటింగ్ లో రవితేజ లేడట. అది చిన్న పిల్లలతో తీసిన ఎపిసోడ్ కావడం వల్ల, ఆ భవనంతో తనకు సంబంధం లేదని తెలిపాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీలో ఇలియానా హీరోయిన్ గా నటించగా, సునీల్, లయ వంటి స్టార్స్ ముఖ్య పాత్రల్లో నటించారు.