మరో మెగా హీరో కూడా సిద్ధమైయ్యాడు..

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి దాదాపు 10 మంది హీరోలు ఇండస్ట్రీ కి పరిచయం కాగా , తాజాగా మరో హీరో రాబోతున్నాడు. అతడే చిరంజీవి మేనల్లుడు , సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. ఇటీవల మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాకు మంచి టాకే వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్లను రాబట్టలేకపోయాడు. దీంతో ఈ చిత్రాన్ని నిర్మించిన సాయి కొర్రపాటి కి నష్టాలే అని తేలింది.

వాస్తవానికి వైష్ణవ్ తేజ్ ను కూడా సాయి కొర్రపాటి నే ఇండస్ట్రీ కి పరిచయం చేయాలనీ భావించాడట. కానీ విజేత దెబ్బకు రిస్క్ ఎందుకని వెనకడుగు వేసాడని తెలుస్తుంది. ఈ నేపథ్యం లో నేల టిక్కెట్టు తో భారీ ప్లాప్ చవిచూసిన నిర్మాత రామ్ తాళ్ళూరి చేతిలోకి వెళ్లినట్టు తెలుస్తుంది. అప్పట్లో ఒకడుండేవాడు లాంటి టిపికల్ సబ్జెక్టు తో విమర్శకులను సైతం మెప్పించిన దర్శకుడు సాగర్ చంద్ర దీనికి దర్శకత్వం వ్యవహరించబోతున్నాడు. కొన్ని రోజులుగా వెండి తెరకు వైష్ణవ్ తేజ్ రావాలని ట్రై చేస్తున్నాడు. మొత్తానికి అనుకున్నట్లే అతి త్వరలో రాబోతున్నాడు.

ప్రస్తుతం తన అన్న సాయి ధరమ్ తేజ్ వరుస డిజాస్టర్లతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ నేపథ్యం లో తమ్ముడు ఎంట్రీ ఇవ్వడం విశేషమే. మరి ఈ మెగా హీరో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.