‘క్రాక్’ లో వరలక్ష్మీ షూటింగ్ పూర్తి ..

డిస్కో రాజా చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ రవితేజ..ప్రస్తుతం తన 66 వ చిత్రం క్రాక్ లో నటిస్తున్నాడు. బలుపు , డాన్ శ్రీను చిత్రాల ఫేమ్ గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి డైరెక్ట్ చేస్తుండగా శృతి హాసన్ , వరలక్ష్మీ శరత్ కుమార్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా..వరలక్ష్మీ కి సంబందించిన షూటింగ్ ను చిత్ర యూనిట్ పూర్తి చేసారు. ఇటీవలే ఫైనల్ షూట్ ను ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఫైనల్ డే షూట్ కు వచ్చేసింది. అది మాత్రమే కాకుండా ఈ ఫైనల్ రోజు షూట్ ను ప్రముఖ టాలెంటెడ్ నటి వరలక్ష్మీ పై సీన్స్ తో కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టేసినట్టుగా చిత్ర దర్శకులు మరియు ఇతర యూనిట్ తెలిపారు. ఈమెపై షూట్ తో ముగించమని ఆమె ఒక అద్భుతమైన నటి అంటూ గోపీచంద్ కితాబిచ్చారు.