వర్మ క్లారిటీ ఇచ్చాడుగా..

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..మరోసారి ఈ పేరు సంచలనంగా మారింది. మొన్నటి వరకు లక్ష్మి స్ ఎన్టీఆర్ తో వివాదంలో నిలిచినా వర్మ.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ను ప్రకటించాడు. టైగర్ కెసిఆర్ అనే టైటిల్ పెట్టి సినిమా ఫై ఇప్పటి నుండే ఆసక్తి కనపరిచాడు. కొంత కాలంగా బయోపిక్ లపై పడ్డ వర్మ కేసీఆర్ రాజకీయ ఎదుగుదలను సినిమాగా తీయడానికి సంకల్పించిన సంగతి తెలిసిందే.


ఈమేరకు ‘టైగర్ కేసీఆర్’ పేరుతో ఫస్ట్ లుక్ విడుదల చేసి ఆసక్తి మొదలు పెట్టిన వర్మ…ఆ తర్వాత పాట పాడుతూ వీడియో కూడా షేర్ చేశాడు. ఆంధ్రోడా అంటూ సాగిన పాట ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్న చర్చ సాగింది. తాజాగా దీనిపై ట్విట్టర్ లో వర్మ వివరణ ఇచ్చాడు. తాను తీయబోయే సినిమా ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా ఉండదని.. తెలంగాణ ప్రజలను అవమాన పరిచిన కొంత మంది ఆంధ్రా నాయకులకు వ్యతిరేకంగా మాత్రమే ‘టైగర్ కేసీఆర్ ’ ఉంటుందని తెలిపారు. తెలుగు ప్రజలందరినీ కేసీఆర్ ప్రేమించారని…. ఆయన యుద్ధం తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఆంధ్రా నాయకుల మీదేనని అన్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ వర్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.