మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కైరా అద్వానీ జంటగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ `వినయ విధేయ రామ’. ప్రస్తుతం రెండు పాటల చిత్రీకరణ మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతన్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని నిన్నటి వరకు చెప్పిన చిత్ర యూనిట్..తాజాగా ఆ డేట్ ను ఫిక్స్ చేసారు.
డిసెంబర్ 26తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 11న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. అందులో భాగంగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగిందని సమాచారం. ఇక ఇప్పటికే చిత్రంలో సెంటిమెంట్ సాంగ్ విడుదలై ఆకట్టుకోగా, చిత్రంలోని రెండవ సాంగ్ ‘తస్సాదియ్యా’ రేపు సాయంత్రం 4గంటలకు విడుదలకానుంది.
రంగస్థలం తర్వాత చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. మరి సంక్రాంతి బరిలో రాబోతున్న ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.