రామతీర్థం సందర్శించిన అప్పలనాయుడు

నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా భారీ మెజార్టీ తో గెలుపొందిన బడ్దుకొండ అప్పలనాయుడు కి ప్రజలు , నేతలు , కార్య కర్తలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే గా గెలుపొందిన నేపథ్యంలో అప్పలనాయుడు ప్రసిద్ధి పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానాన్ని సందర్శించారు.

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని..రాజశేఖర్ రెడ్డి హయాంలో పుణ్య క్షేత్రాల అభివృద్ధికి కృషి చేసారని..ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో దేవాలయాలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. మళ్లీ రాజన్న రోజులు వచ్చాయని…జగనన్న అన్ని కష్టాలను తీరుస్తాడని..ఆలయాల అభివృద్ధికి ఎంతో సాయం చేస్తాడని ఈ సందర్బంగా ఆయన అన్నారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున అప్పలనాయుడు కు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి వచ్చారు.