బాబ్లీ కేసు కు సంబందించి ధర్మాబాద్ కోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కు షాక్ ఇచ్చింది. చంద్రబాబు తరపున న్యాయవాదులు దాఖలు చేసిన రీకాల్ పిటిషన్ను కోర్ట్ తిరస్కరించింది. చంద్రబాబు సహా 16 మంది కోర్టుకు హాజరుకావల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో వారెంట్ అందుకున్న అప్పటి తెలంగాణ టీడీపీ నేతలకు బెయిల్ మంజూరు అయ్యింది.
ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ప్రకాష్గౌడ్, గంగుల కరుణాకర్, కేఎస్ రత్నంకు బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాబాద్ కోర్టు ప్రకటించింది. ఈ కేసులో చంద్రబాబుతో సహా మరో 19 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.