జగన్ మరోసారి ఢిల్లీకి…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి హస్తినకు బయలుదేరబోతున్నారు. నిన్న మోడీ ని కలిసి రాష్ట్రానికి సంబందించిన అనేక అంశాల గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. రేపు మరోసారి ఢిల్లీ కి బయలుదేరబోతున్నారు. రేపు సాయంత్రం ఆరు గంటలకు అమిత్‌షాతో జగన్‌ భేటీ కాబోతున్నారు.

మండలి రద్దుతో పాటు ఏపీ అంశాలపై అమిత్ షా తో చర్చిస్తారని వైసీపీ వర్గాలు అంటున్నారు. వాస్తవానికి జగన్ నిన్ననే అమిత్ షాను కలవ వలసి ఉన్నా ఆయన ఢిల్లీ ఫలితాలపై సమీక్షలో బిజీగా ఉండటంతో విజయవాడకు వెనుదిరిగారు. అపాయింట్‌మెంట్‌ను రీషెడ్యూల్ చేసిన కేంద్ర హోం శాఖ ఈరోజే సీఎం జగన్ కు కబురు పంపింది. రేపు ఢిల్లీకి జగన్ వెళ్లనున్నారు.