పిల్లల తల్లిదండ్రుల్లో ఆనందం నింపిన జగన్..

ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండే జగన్ మోహన్ రెడ్డి తన మార్క్ చూపిస్తూ బెస్ట్ సీఎం అనిపించుకున్నాడు. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకొచ్చి ఆనందం నింపగా..తాజాగా ప్రైవేట్ స్కూల్ ఫీజుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకొని పిల్లల తల్లిందండ్రుల్లో ఆనందం నింపారు.

జనవరి 26 నుంచి ‘అమ్మఒడి’ చెక్కుల పంపిణీ జరుగుతుందన్నారు . ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు గుర్తింపు తప్పనిసరని.. కనీస ప్రమాణాలు, కనీస స్థాయిలో ఉపాధ్యాయులు ఉండాలన్నారు.

ఇక కేంద్రం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలో నూరుశాతం అమలు చేస్తామని .. రాష్ట్రంలో విద్యార్థులు, తల్లుల్ని ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి పథకాన్ని తీసుకొస్తున్నామన్నారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతూనే.. తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తామన్నారు. ఇక పిల్లలకు యూనిఫారాలు, పుస్తకాలు సకాలంలోనే ఇస్తామన్నారు.