ప్రజావేదిక తొలగించే నిర్ణయం ఫై కేశినేని సలహా..

గత కొన్ని రోజులుగా మీడియా లో కేశినేని నాని హైలైట్ గా నిలుస్తున్నారు. తెలుగుదేశం నేతల ఫై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న నాని..తాజాగా ఏపీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఫై తన సలహా ఇచ్చాడు. ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు ఉండవల్లి కరకట్టపై నిర్మించిన ప్రజావేదికను కూల్చి వేయాలని జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ఫై కాస్త వ్యతిరేకత వస్తుంది. ప్రజావేదికను కూల్చివేయాలన్న నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుండగా… మరికొందరు మాత్రం ప్రజాధనం ఆదా చేస్తున్నామంటున్న జగన్… కోట్లాది రూపాయల ప్రజల డబ్బుతో నిర్మించిన కట్టడాన్ని కూల్చివేయడం సరికాదంటున్నారు.

దీనిపై కేశినేని నాని సైతం తన సలహాను సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రజావేదికను తొలగించాలనుకుంటే అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగించిన తర్వాత చివరిగా తొలగిస్తే మంచిదని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ప్రజావేదిక అక్రమమో, సక్రమమో పక్కన పెడితే.. అది ప్రజాధనంతో నిర్మించిన వేదిక అని పేర్కొంటూ ఆయన ట్వీట్‌ చేశారు.