హే..పవన్ ప్రెస్ మీట్ పెట్టాడుగా..

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కనిపించకుండా పోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు కనిపించారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ని కాబోతున్న..ప్రజలు పెద్ద ఎత్తున జనసేన కు మద్దతు ప్రకటిస్తున్నారని..ఆంధ్ర రాష్ట్రానికే పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నాడని తెగ ప్రచారం చేసుకొచ్చిన పవన్..పోలింగ్ తర్వాత అసలు ఊసే లేకుండా పోయేసరికి అంత నానా రకాలుగా మాట్లాడుకున్నారు.

ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. తొలి విడత సమీక్షలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన అభ్యర్థులతో పవన్ సమావేశమయ్యారు. పోలింగ్ ముగిసిన దాదాపు 10రోజుల తర్వాత పార్టీ తరఫున మొదటి సమావేశం ఇదే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలు, ఈవీఎంల పనితీరుపై నాయకుల అభిప్రాయలు తీసుకుంటున్నారు. అలాగే కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు సరిగా ప్రచారం నిర్వహించలేదనే సమచారం పార్టీకి ఉంది. అభ్యర్థులతో సమీక్ష సందర్భంగా ఈ విషయాన్ని పవన్ ప్రస్తావించి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.