చంద్రబాబుకు మరో నోటీసు !

ఏపీ సీఎం చంద్రబాబుకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సినీనటుడు శివాజీ . ”చంద్రబాబు మీద భారీ కుట్ర జరుగుతోంది.. ఇది అమానుషం. త్వరలో చంద్రబాబుకు మరో రెండు, మూడు నోటీసులు వస్తాయి. రెండో నోటీసు సిద్ధంగా ఉంది” అని చెప్పారు.

ఒక మనిషిని నిర్వీర్యం చేయడానికి, ఒక కుర్చీని ఆక్రమించుకోవడానికి ఇంత కుట్ర పూరిత రాజకీయాలు అవసరమా? అని మండిపడ్డారు.మనుషుల్ని నలిపేద్దాం, ప్రభుత్వాలను కూల్చేద్దాం అనే విధంగా రాజకీయాలు చేయడం దారుణమని అన్నారు. సమాజంలో స్వేచ్ఛను కోల్పోయే పరిస్థితులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పుడు వచ్చిన నోటీసులు దీనికి నిదర్శనమని చెప్పారు.