తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇంకో యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటించాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసినట్టుగా వచ్చిన వార్తలపై విజయసాయి రెడ్డి ఇలా స్పందించారు.
‘‘ఇకపై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏలో చంద్రబాబు కొనసాగరట. కేంద్రంపై పోరాటాలకు విరామం ఇస్తారట. మోదీ, అమిత్ షాకు మోకరిల్లే ప్రయత్నమని ఇవన్నీ చూస్తే అర్థమవుతోంది. ముగ్గురు ఎంపీలతో ఎన్ని యూటర్న్లు తీసుకున్నా పట్టించుకునేవారుండరు’’ అని ట్వీట్ చేశారు.