రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు వేల సంఖ్య లో కొత్త కేసులు నమోదు అవుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కేవలం నాగరాల్లోనేకాదు జైల్లోనూ కరోనా కలకలం రేపుతోంది. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో కొత్తగా 10 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

దీంతో ఇప్పటి వరకు 28 మంది ఖైదీలకు కరోనా సోకినట్టు తెలుస్తుంది. 900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు చేయగా ఆ ఫలితాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఈ క్రమంలో ములాఖత్ లు తాత్కాలికంగా నిలిపి వేశారు జైలు అధికారులు. ఈరోజు సాయంత్రానికి పూర్తిగా నిర్ధారణ ఫలితాలు రానున్నట్టు చెబుతున్నారు.