కరోనా తో కాంగ్రెస్ మాజీ ఎంపీ కన్నుమూత ..

కరోనా మహమ్మారి పడి సామాన్య ప్రజలే కాక సినీ , రాజకీయ నేతలు సైతం బలి అవుతున్నారు. ఇప్పటికే పలువురు మరణించగా..తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన కు కరోనా సోకడం తో .. హైదరాబాద్ నగరంలో నిమ్స్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో కొద్దీ సేపటి క్రితం ఆయన ప్రాణాలు కోల్పోయారు.

నంది ఎల్లయ్య మృతి పట్ల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈయన కాంగ్రెస్ పార్టీ తరపున నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నంది ఎల్లయ్య ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యడిగా పనిచేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటిచేసి మంద జగన్నాథంను ఓడించి 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.