తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు సమీపిస్తుండడం తో అన్ని పార్టీలు తమ ప్రచారం తో జనాల్లోకి వెళ్తున్నాయి. ఎలాగైనా తెరాస ను ఓడించేందుకు మిగతా పార్టీలన్నీ ఏకమై ఓ కూటమి లాగా ఎన్నికల బరిలోకి దిగుతుంటే, తెరాస మాత్రం తమ పథకాలతో చేసిన పనులతో ప్రజల్లోకి వెళ్తుంది. అలాగే తెరాస పార్టీలో టికెట్స్ రాని అభ్యర్థులు వేరే పార్టీల్లోకి చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ గూటికి చేరుకోగా , తాజాగా మాజీ మంత్రి గడ్డం వినోద్ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు.
చెన్నూర్ టికెట్ ఇవ్వకుండా టీఆర్ఎస్ తనను మోసం చేసిందన్న ఆయన.. నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులను వివరించినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. అందుకే తెరాస పార్టీ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్పా పార్టీలో చేరుతున్నట్లు మీడియా కు తెలియజేసాడు.అలాగే తన తమ్ముడు వివేక్ సైతం పార్టీ మారబోతున్నట్లు వినిపిస్తున్న వార్తలపై తనకు తెలియదని సమాధానం తెలిపారు.