గాంధీ ముని మనవడు కన్నుమూత

కరోనా మహమ్మారికి ఎంతోమంది బలివుతున్నారు. ఇప్పటికే సినీ , రాజకీయ , బిజినెస్ ఇలా అన్ని రంగాల వారు కన్నుమూయగా..తాజాగా మహాత్మా గాంధీ మనవళ్లలో ఒకరైన సతీష్ ధుపేలియా కన్నుమూశాడు.

తన 66 వ పుట్టినరోజు అయిన మూడు రోజుల తరువాత ఆదివారం జోహన్నెస్‌బర్గ్‌లో COVID-19 కారణంగా మరణించారు. న్యుమోనియా కారణంగా ఒక నెలపాటు ఆసుపత్రిలో చికిత్సలో ఉన్న ఈయన కరోనా కూడా సోకడంతో మరణించారు. ఇక తన సోదరుడు కోవిడ్ -19 సంబంధిత సమస్యలతో మరణించాడని ఉమా ధుపేలియా-మెస్త్రీ ధృవీకరించారు. ‘నా ప్రియమైన సోదరుడు న్యుమోనియాతో బాధ పడ్డాడు, ఆస్పత్రిలో ఈ మహమ్మారి కూడా సంక్రమించింది, ఆపై కోవిడ్ -19 కూడా చికిత్స పొందుతున్నప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చింది ‘అని ధుపెలియా-మెస్త్రీ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.