జనసేన నిశ్శబ్ద విప్లవమట

ఈ ఎన్నికల్లో సోలో గా దిగింది జనసేన. గతంలో టీడీపీ బీజీపీతో పొత్తుపెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం వామపక్షాలతో జతకట్టి దాదాపుగా సోలో ఫైట్ చేశారు. ఐతే మీడియాలో మాత్రం అసలు జనసేన హడావిడి లేదు. సర్వేలు కూడా టీడీపీ వైసీపీ అనే మాట్లాడుతున్నాయి. ఐతే రాష్ట్రంలో జనసేన పార్టీ నిశ్శబ్ద విప్లవం సృష్టించనుందని ఆ పార్టీ నేత మాదాసు గంగాధరం చెప్పుకొచ్చారు

విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని రోజులుగా ఈవీఎంలపై వివిధ పార్టీల నేతలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఈసీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మీనారాయణ, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై జరుగుతున్న మాటల యుద్ధంపై స్పందించిన మాదాసు.. విజయసాయిరెడ్డికి ఏ పనీలేదేమో గానీ.. జనసేనకు మాత్రం ప్రజల సమస్యలే ముఖ్యమని ఎద్దేవా చేశారు.