పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై నిరసన


జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఇటీవల మావోయిస్టుల చేతిలో చనిపోయిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు సతీమణి పరమేశ్వరి మండిపడ్డారు. తెదేపాలోకి వెళ్లిన వైకాపా ఎమ్మెల్యేను చంపింది గోదావరి జిల్లా నుంచి నక్సలిజంలోకి వెళ్లిన ఆడపడుచు.. ఆమె ఎందుకు అటువైపు వెళ్లిందో ఆలోచించుకోవాలని పవన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

అయితే, తన భర్త హత్యకు గురై నెల కూడా కాకముందే ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలుచేయడం తమనెంతగానో బాధించిందని .. కిడారి గురించి ప్రజలందరికీ తెలుసని ఆమె తెలిపారు. మావోయిస్టులకు అనుకూలంగా పవన్ వ్యాఖ్యలు చేశారంటూ ఆమె గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. తమకు ధైర్యం ఇవ్వాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలతో బాధపెట్టొద్దని ఆమె కోరారు.