మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉత్తమ్ సహా పలువురు వేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పుతో నోటిఫికేషన్ విడుదలకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తుంది.
కాగా మున్సి పల్ ఎన్నికల నోటిఫికేషన్ను మంగళవారం తాము ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇవ్వొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సోమవారం హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్కు లైన్క్లియర్ అయింది.
జనవరి 10న నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ
జనవరి 11న నామినేషన్ల పరిశీలన
జనవరి 14 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ
జనవరి 22న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు..ఫలితాలు విడుదల