ఆ ముగ్గురు కూడా కార్ ఎక్కబోతున్నారట…

మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ బాగా పనిచేస్తుంది. శాసన సభ ఎన్నికల తర్వాత గులాబీ బాస్ ఆకర్ష్ పేరుతో హస్తం పార్టీ లో ఎవరు లేకుండా చేస్తున్నాడు. ఇప్పటికే సగం పైగా కాంగ్రెస్ నేతలను టీఆరఎస్ లోకి తీసుకున్న కేసీఆర్…తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యే లను కూడా కలుపుకోబోతున్నట్లు తెలుస్తుంది.

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 24న వీరంతా టీఆర్‌ఎస్‌లోచేరనున్నట్లు సమాచారం. తాజా చేరికలతో తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోనుంది. జూన్‌ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.