అసెంబ్లీ లో ముష్టి యుద్ధం.. స్పీకర్ పై దాడి

tn

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో ముష్టి యుద్ధం జరిగింది. రహస్య ఓటింగ్‌కు స్పీకర్‌ అనుమతించకపోవడంతో డీఎంకే సభ్యులు బీభత్సం సృష్టించారు. కుర్చీలు విసిరేసి, మైకులు విరగ్గొట్టి తీవ్ర గందరగోళం సృష్టించారు.

ఈ క్రమంలో స్పీకర్ పై దాడి చేశారు. దీనిపై స్పీకర్ మాట్లాడుతూ.. నాకు నిండు సభలో అవమానం జరిగింది.. నాకు జరిగిన అవమానాన్ని ఎవరికి చెప్పుకోవాలని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తనపై జరిగిన దానిపై ఎవరికి ఫిర్యాదు చేయాలని స్పీకర్ కంటతడి పెత్తుకున్నారు.

స్పీకర్‌పై డీఎంకే ఎమ్మెల్యేలు దాడి చేసి ఆయన చొక్కా చించారని మరి కొందరు ఎమ్మెల్యేలు ఆయన్ను తీవ్ర అసభ్య పదజాలంతో దూషించినట్లు కధనాలు వస్తున్నాయి