తెలంగాణ లో విలయతాండవం : 11 మంది మృతి , 2043 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2043 కేసులు నమోదు కాగా , 11 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,67,046కి చేరగా , మరణాల సంఖ్య 1016కి చేరింది. కరోనా నుంచి తాజాగా 1,802 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,35,357కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 30,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో కేసుల వివరాలు చూస్తే..

జీహెచ్‌ఎంసీ పరిధిలో 314, ఆదిలాబాద్ 19, భద్రాద్రి కొత్తగూడెం 49, జగిత్యాల్‌ 42, జనగాం 25, జయశంకర్ భూపాలపల్లి 23, జోగులమ్మ గద్వాల్‌ 17, కామారెడ్డి 31, కరీంనగర్‌ 114, ఖమ్మం 84, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 20, మహబూబ్‌ నగర్‌ 26, మహబూబాబాద్‌ 74, మంచిర్యాల్‌ 25, మెదక్‌ 25, మేడ్చల్ మల్కాజ్‌గిరి 144, ములుగు 16, నాగర్‌ కర్నూల్‌ 32, నల్గొండ 131, నారాయణ్‌పేట్‌ 12, నిర్మల్‌ 16, నిజామాబాద్‌ 65, పెద్దంపల్లి 48, రాజన్న సిరిసిల్ల 46, రంగారెడ్డి 174, సంగారెడ్డి 71, సిద్ధిపేట్‌ 121, సూర్యాపేట 51, వికారాబాద్‌ 20, వనపర్తి 22, వరంగల్‌ రూరల్‌ 33, వరంగల్‌ అర్బన్‌ 108, యాద్రాది భువనగిరి 45 కేసులు నమోదయ్యాయి.