‘పసుపు-కుంకుమ’ టీడీపీకి శ్రీరామ రక్ష !

‘పసుపు-కుంకుమ’ పధకం టీడీపీ శ్రీరామ రక్షగా మారే అవకాశం వుందని అభిప్రాయపడ్డారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.
‘పసుపు-కుంకుమ’ కింద మహిళలకు పదివేల రూపాయలు చంద్రబాబు ఇచ్చారనే భావన మహిళల్లో వుంటే వాళ్లే కాదు వాళ్ల కుటుంబసభ్యులు కూడా టీడీపీకే ఓటు వేస్తారని అభిప్రాయపడ్డారు.

దేశంలో ఎక్కడా లేనట్టుగా ‘పసుపు-కుంకుమ’ కింద పది వేల రూపాయలు ఖాతాలో వేసి, మళ్లీ తామే అధికారంలోకొస్తే అదే మొత్తం వేస్తూనే ఉంటానని మహిళలకు చంద్రబాబు ఇచ్చిన హామీ వారిపై కచ్చితంగా పనిచేస్తుందని అనుకుంటున్నానని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న సంగతి పక్కన పెడితే.. అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చే అవకాశం వుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అంత తేలిగ్గా తీయలేమని, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆయన అద్భుతంగా పని చేశాడని అన్నారు.